ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మాకు తీపి కబురు

ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మాకు తీపి కబురు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు రాష్ట్ర సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. సెర్ఫ్ లో 4,500 మంది పని చేస్తున్నారని, సెర్ఫ్ సొసైటీ , ప్రభుత్వ ఉద్యోగులు కాదని అన్నారు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్, మెప్మాకు తీపి కబురుమంచి ఫలితాలు వస్తున్నాయి. సెర్ఫ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధిహామీలో పని చేస్తారని అన్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారని సీఎం తెలిపారు.

ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నరు. వాళ్లపై మాకేం కోపం లేదని, ఆ అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా, ఇకపై పొరపాట్లు పునరావృతం చేయద్దని కేసీఆర్ కోరారు. ‘ మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం. వాళ్లు పొరపాటు చేశారు. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇకపై మళ్లీ ఆ తప్పుపని చేయమని చెప్పారు. అందరి మాటనే నా మాట, వారందరిని విధుల్లోకి తిరిగి తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ తర్వాత మెప్మా ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని సీఎం తెలిపారు. వాళ్లను సైతం పరిగణలోకి తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెక్కలు తేల్చి, అందరికీ న్యాయం చేస్తాం’ అని కేసీఆర్ వెల్లడించారు.