నాకు కరోనా సోకలేదు: పద్మాదేవేందర్ రెడ్డి

కరోనా సోకినట్లు వచ్చిన వార్తలను ఖండించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డినాకు కరోనా సోకలేదు: పద్మాదేవేందర్ రెడ్డితనకు కరోన సోకిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కొట్టిపారేశారు. కొందరు కావాలనే కరోన సోకిందని తనపై ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా సోషల్ మీడియాలలో ప్రచారం అవుతున్న పుకార్లపై గులాబీ నేతలు మెదక్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. కరోన సోకిందనే వార్తను వాట్సాప్ లో పార్వర్డ్ చేసినందుకు మెదక్ మండలంలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.