భారత్‌-చైనా ఘర్షణలో తెలంగాణ కల్నల్ మృతి

భారత్‌-చైనా ఘర్షణలో తెలంగాణ కల్నల్ మృతి

వరంగల్ టైమ్స్, లద్దాఖ్: భారత్‌-చైనా బలగాల మధ్య ల‌డ‌ఖ్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘర్షణలో భార‌తీయ క‌ల్న‌ల్ ఒక‌రు మృతిచెందారు. వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు(37) తెలంగాణ రాష్ట్రనికి చెందిన సూర్యాపేట వాసి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా అందులో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన ల్నల్‌ సంతోష్‌బాబు(37) ఉన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.భారత్‌-చైనా ఘర్షణలో తెలంగాణ కల్నల్ మృతిలద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో  భారత్‌, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందరు. సంతోష్‌ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.