టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా తప్పుకున్న మాణిక్యం

టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా తప్పుకున్న మాణిక్యం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ సీనియర్లు మాణిక్యం ఠాగూర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభేధాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్. ఆయన రిపోర్టుతో త్వరలో తెలంగాణకి కొత్త ఇన్ఛార్జ్ గా నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. కాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాణిక్యం ఠాగూర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ మాటకు గాంధీ భవన్ లో విలువ ఉండటం లేదని సీనియర్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ ను వీడిన పలువురు నేతలు ఠాగూర్ పై విమర్శలు చేసిన సంగతి విదితమే.టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా తప్పుకున్న మాణిక్యంఇదిలా ఉండగా..తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన వివాదాలకు పరిష్కారం చూపేందుకు, పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తెలంగాణలో రెండ్రోజుల పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించారు. టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఇవి పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీరి మధ్య వెంటనే సయోధ్య కుదుర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని తెలిపారు. ఈమేరకు ఆయన హైకమాండ్ కు నివేదికను సమర్పించారు.