స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు 

స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,69,568 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 121 మందికి పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,215కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,30,722కి చేరింది.

ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని తెల్పింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాల 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.14 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.