730 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

730 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కల్గినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 12 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 700లకు పైగా పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.

మొత్తం పోస్టులు : 730 ఉండగా, ఇందులో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 670, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 60 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు : డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 42 యేండ్ల వయస్సులోపు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
అప్లికేషన్లకు చివరి తేదీ : 2022, జనవరి 19
వెబ్ సైట్ : https://psc.ap.gov.in/