బాధితులకు రూ. 5లక్షల పరిహారం: కేసీఆర్ 

బాధితులకు రూ. 5లక్షల పరిహారం: కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున సీఎం పరిహారం ప్రకటించారు. బాధితులకు రూ. 5లక్షల పరిహారం: కేసీఆర్ మృతదేహాలను బీహార్ కు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తెల్లవారుజామను టింబర్ డిపోలో చెలరేగిన మంటలకు మొత్తం 11 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గాయపడిన వ్యక్తికి కూడా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు.