ఏపీ రాజధాని అంశంపై కేంద్రం వివరణ

ఏపీ రాజధాని అంశంపై కేంద్రం వివరణ

వరంగల్ టైమ్స్, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. జులై 26న ఏపీ రాజధాని విశాఖ అని అర్థం వచ్చేలా లోక్‌సభలో కేంద్రం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రం తాజాగా  వివరణ ఇచ్చింది. విశాఖ ఏపీ రాజధాని అని చెప్పడం మా ఉద్దేశం కాదని కేంద్రం పేర్కొంది. ‘విశాఖ ఏపీ రాజధాని కాదు.. రాష్ట్రంలో నగరం మాత్రమేనని, పెట్రో పన్నుల విషయంలో విశాఖను ఉదాహరణగా తీసుకున్నట్లు’ కేంద్రం పేర్కొంది.ఏపీ రాజధాని అంశంపై కేంద్రం వివరణ అంబాలా, లుథియానా నగరాలను సైతం ఉదాహరణగా తీసుకున్నట్లు తెలిపింది. అంబాలా, లుథియానా నగరాలు ఆయా రాష్ట్రాల్లో రాజధానులు కావని కేంద్రం వివరణ ఇచ్చింది. టైటిల్‌ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం పేర్కొంది. హెడ్డింగ్‌లో జరిగిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుతున్నామని తెలిపింది. రాజధానితో పాటు సమాచారం సేకరించిన నగరంగా పేరు చేర్చుతున్నట్లు ప్రకటించింది. లోక్‌సభ సచివాలయానికి కూడా ఈ సమాచారం ఇచ్చామని కేంద్రం చెప్పింది.