ఆ 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదుకు రెడీ

ఆ 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదుకు రెడీ

ఆ 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదుకు రెడీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ సీఎల్పీలో భేటి కానుంది. అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ భేటీలో పాల్గొనున్నారు. సీఎల్పీ కార్యాలయంలో భేటీ అనంతరం కాంగ్రెస్ ముఖ్య నాయకుల బృందం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనుంది.12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. నలుగురు ఎమ్మెల్యే ల కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడంతో సంచలనంగా మారింది.