మార్చి 4న నర్సింగ్, ఎంపీటీ సర్టిఫికెట్ల పరిశీలన

మార్చి 4న నర్సింగ్, ఎంపీటీ సర్టిఫికెట్ల పరిశీలన

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 4న ధృవపత్రాల పరిశీలన
పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల
నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులకు ఇటీవలే దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగిసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధారంగా ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ను యూనివర్సిటీ విడుదల చేసింది . ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 4న ధ్రువపత్రాల పరిశీలనకు జె ఎన్ టీయూ, కూకట్ పల్లి, హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన సెంటర్ కు హాజరు కావాల్సి వుంటుంది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.