ఏపీలో గిన్నీస్​ రికార్డు దాటిన రక్తదానం

ఏపీలో గిన్నీస్​ రికార్డు దాటిన రక్తదానంఅమరావతి: సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగారాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు , నాయకులు నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమై గిన్నీస్​ రికార్డులను తిరగరాసింది. పాత రికార్డు 10500 యూనిట్లు ఉండగా ఆ రికార్డును తిరగరాస్తూ సీఎం జగన్​ అభిమానులు, పార్టీ కార్యకర్తలు 18000 యూనిట్లు రక్తదానం చేసి గిన్నీస్​లో ఉన్న పాత రికార్డును దాటి కొత్త రికార్డును నెలకొల్పారు. అలాగే క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్​ జగన్​కు తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు అశీర్వచనం ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. వారి వెంట టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.ఏపీలో గిన్నీస్​ రికార్డు దాటిన రక్తదానం