రేపు కాలినడకన తిరుమలకు ఎమ్మెల్సీ కవిత

రేపు కాలినడకన తిరుమలకు ఎమ్మెల్సీ కవిత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని మధ్యాహ్నం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి, సాయంత్రానికి కొండ మీదకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు.