ముగిసిన గ్రూప్-4 దరఖాస్తుల గడువు 

ముగిసిన గ్రూప్-4 దరఖాస్తుల గడువు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తుల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను నిర్వహించింది. వాస్తవానికి జనవరి 30 తో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగిసింది.ఆ రోజు వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి.

జనవరి 29న 49వేలు, 30న 34,247 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల వ్యవధిలో 1,04,044 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. గ్రూప్-4 రాత పరీక్ష జులై1 న నిర్వహించనున్నట్లు నిన్న టీఎస్పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.