చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం 

చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్‌ : తల్లి గర్భం నుంచి బయట పడి ప్రపంచాన్ని చూసిందో లేదో చెత్తకుప్పకు చేరి విగత జీవిగా మారిందో పసికందు. అప్పుడే పుట్టిన పాపాయికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మరి ఏ పాపం తెలియని ఆ పసికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో ఈ లోకాన్ని చూడక ముందే కన్నుమూసింది. రాజేంద్ర నగర్‌లోని రాంబాగ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పట్టిన ఓ పసికందు మృతదేహం చెత్త కుప్పలో దర్శనమిచ్చింది.చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగించేందుకు రాగా చెత్తకుప్పల పక్కనే ఉన్న మూటలో చిన్నారి మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారిని మృతదేహాన్ని ఎవరు పడేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శిశువుని చంపి మూటలో కట్టి చెత్త కుప్పలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.