రెండో వన్డేలో 6వ ర్యాంక్ కు కోహ్లీ  

రెండో వన్డేలో 6వ ర్యాంక్ కు కోహ్లీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ తన ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసి రెండు ర్యాంకులు మెరుగై 6వ స్థానానికి చేరుకున్నాడు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మహమ్మద్ సిరాజ్ ర్యాంకులు కూడా మెరుగయ్యాయి. రెండో వన్డేలో 83 పరుగులు చేసిన రోహిత్ ఒక స్థానం మెరుగై 8వ ర్యాంకుకు చేరుకున్నారు.రెండో వన్డేలో 6వ ర్యాంక్ కు కోహ్లీ  బౌలర్లలో సిరాజ్ 4 స్థానాలు మెరుగుపరుచుకుని 18వ స్థానానికి చేరుకున్నాడు. టీ 20 లలో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.