ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి

ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లివరంగల్ టైమ్స్, ముచ్చింతల్: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ క్షేత్రంలో జరుగుతున్న రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం సాయంత్రం ముచ్చింతల్ క్షేత్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముచ్చింతల్ క్షేత్రంలో ఉత్సవాలలో భాగంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న యాగ శాలలో 108 దివ్య దేశాల ప్రతిష్ట, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమత మూర్తి లోకార్పణ ఏర్పాట్లను పరిశీలించి వాలంటీర్లకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సంసృతిక, ఇతర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో వేరు వేరుగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించి వైద్యులకు పారా మెడికల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు.