పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. ఇక అంతే !

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. ఇక అంతే !

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయని పన్ను చెల్లింపు దారులకు ఐటీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదాయం పన్నుశాఖ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లో తాజా అప్ డేట్ లో ‘2017 మే 11న జారీ చేసిన నోటిఫికేషన్ 37/2017 ప్రకారం మినహాయింపు లేని పాన్ కార్డు దారుల్లో ఆధార్ తో అనుసంధానించని వారంతా తక్షణం లింక్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అనుసంధానం చేయని పాన్ కార్డులు ఇన్ ఆపరేటివ్’ గా మారతాయని పేర్కొంది.

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. ఇక అంతే !

 

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి చివరి తేదీ 2023 మార్చి 31. ఇన్ కం టాక్స్ యాక్ట్-1961 ప్రకారం పాన్ కార్డు దారులంతా ఆధార్ కార్డును అనుసంధానించాల్సిందేనని ఐటీ డిపార్ట్మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి అన్ లింక్డ్ పాన్ కార్డ్ ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది. గడువు రోజురోజుకు దగ్గర పడుతున్నది. ఆలస్యం చేయొద్దు. ఈ రోజే లింక్ చేయండంటూ ఐటీ విభాగం ట్వీట్ చేసింది. ఇప్పుడు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ట్విట్టర్ అధికారిక ఖాతాలోనే ఇదే హెచ్చరికలు జారీ చేసింది.