మాదాపూర్ లో ప్లీనరీ స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్

మాదాపూర్ లో ప్లీనరీ స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న మాదాపూర్ హైటెక్స్ లో ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్లీనరీ స్థలాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన విషయాలను వివరించారు.మాదాపూర్ లో ప్లీనరీ స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పండుగగా జరుపుకుంటారు. 21 ఏళ్లు పూరైనందున హెచ్ఐసీసీలో ప్రతినిధుల మహా సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని కేటీఆర్ తెలిపారు. 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. రేపు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ నాయకులతో సమావేశం ఉంటుంది. హెచ్ఐసీసీ వేదికను ఫైనల్ చేయడం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.

21 ఏళ్ల టీఆర్ఎస్ బాల్యదశ నుంచి మెజర్ పార్టీగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నిర్ణయాలు వార్షికోత్సవంలో ఉంటాయని తెలిపారు. ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 12769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించాలని కేటీఆర్ సూచించారు. 3600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థితత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని కేటీఆర్ వెల్లడించారు.