రేషన్ కార్డు దారులకు శుభవార్త 

రేషన్ కార్డు దారులకు శుభవార్త

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దేశంలోని రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే గడువును ఈ యేడాది జూన్ 30 వరకు పెంచింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు దారులకు శుభవార్త దీంతో జూన్ 30 వరకు కార్డు దారులకు రేషన్ సరఫరాలను పొందడంతో పాటు ఇతర పథకాలను, ప్రభుత్వ సౌకర్యాలను పొందుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకు ముందు చివరి తేదీని మార్చి 31, 2022 గా నిర్ణయించారు. ప్రస్తుతం చివరి తేదీని సవరించడంతో 2022 జూన్ 30నాటికి లబ్ది దారులు తమ రేషన్ కార్డులను ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒకటే దేశం, ఒకటే రేషన్ కార్డు పథకాన్ని కూడా ప్రారంభించింది. దీంతో ఒక ప్రాంతానికి చెందిన రేషన్ కార్డుదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం అందించే రేషన్ సరుకులను పొందవచ్చును. వీటితో పాటుగా కేంద్రం అందించే అనేక పథకాలను రేషన్ కార్డు దారులు పొందుతున్నారు.