ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ

ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీఅమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి సమావేశం అయ్యారు. కాసేపటి క్రితమే సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి మెగాస్టార్ చేరుకున్నారు. జగన్ తో చిరంజీవి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ , చిరంజీవికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు.

ఇక టాలీవుడ్ పరిశ్రమ సమస్యలు, సినిమా టికెట్ల ధరలపై ఈ సందర్భంగా సీఎం జగన్ తో చిరంజీవి చర్చించనున్నారు. ఈ భేటీపై హీరో నాగార్జున స్పందించారు. మా అందరి గురించే చిరంజీవి, సీఎం జగన్ తో భేటీ అయ్యారని అన్నారు.

బంగార్రాజు సినిమా విడుదలలో బిజీగా ఉండటం వల్లే చిరంజీవితో కలిసి ఏపీ సీఎం దగ్గరికి వెళ్లలేకపోయానని నాగార్జున అన్నారు. జగన్ తో చిరంజీవి భేటీ అవుతారని గతంలోనే నేను చెప్పానని, జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు. జగన్ కు చిరంజీవి అంటే అభిమానం అని నాగార్జున తెలిపారు.