ఈనెల 19న విశాఖకు భారత ఉపరాష్ట్రపతి

ఈనెల 19న విశాఖకు భారత ఉపరాష్ట్రపతిఅమరావతి : భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 19న విశాఖపట్టణానికి రానున్నారు. 4 రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకుని పోర్టు అతిథిగృహంలో బస చేయనున్నారు. జనవరి 20న ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ 73వ వార్షిక సదస్సులో , 21న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. 22న సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.