ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు

ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలుజగిత్యాల జిల్లా : జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాయికల్ మండలం మైతాపూర్​కు చెందిన బాలుడు సాగర్ కుటుంబ సభ్యులు గురువారం కలిశారు. మూడేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఉన్న సాగర్ కు సాయం అందించాల్సిందిగా బాలుడి కుటుంబ సభ్యులు అప్పుడు ఎంపీగా ఉన్న కవితను కోరారు. దీంతో చలించిపోయిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి ఆపరేషన్​ నిమిత్తం రూ.26లక్షల ఎల్వోసీని మంజూరు చేయించింది. కవిత ప్రత్యేక చొరవతో 2017లో సాగర్​కు లివర్ మార్పిడి జరిగింది. అలాగే సాగర్​కు మెరుగైన వైద్యం అందేవరకు నిరంతరం వైద్యులతో మాట్లాడింది. ప్రస్తుతం సాగర్ పూర్తిగా కోలుకుని చలాకీగా ఉన్నాడు. గురువారం జగిత్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితను సాగర్ కుటుంబ సభ్యులు కలిసారు. అనారోగ్యంతో ఉన్న సాగర్ కు అన్ని విధాలా అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.