వావ్ వ‌రంగల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వావ్ వ‌రంగల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, వరంగల్ అర్బన్ జిల్లా : చారిత్ర‌క‌, సాంస్కృతిక వైభ‌వాల వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని మ‌రింత‌గా అభివృద్ధి ప‌రిచి వావ్ వ‌రంగ‌ల్ అని పిస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అన్ని రంగాల్లోనూ అద్భుత పురోగ‌తిని చూపిస్తామ‌న్నారు.

అపూర్వ వైభ‌వం తేవ‌డం ద్వారా ప్ర‌జ‌లంతా వ‌రంగ‌ల్ ని చూసి వావ్ వ‌రంగ‌ల్ అని అనాల్సిన ప‌రిస్థితిని తీసుకువ‌స్తామ‌ని మంత్రి తెలిపారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఫాతిమా జంక్ష‌న్ లో హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ మీద రూపొందించిన ల‌వ్ హైద‌రాబాద్ త‌ర‌హాలో…వ‌రంగ‌ల్ మున్సిపల్ కార్పొరేష‌న్ ప్ర‌త్యేకంగా రూపొందించిన వావ్ వ‌రంగ‌ల్ ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్ తో క‌లిసి ఆవిష్క‌రించి, ప్రారంభించారు.వావ్ వ‌రంగల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లివ‌రంగ‌ల్ అంటే ఓ చ‌రిత్ర‌, వ‌రంగ‌ల్ అంటే అభివృద్ధికి, గొప్ప సంస్కృతికి, గొలుసుకంట్టు చెరువుల‌కు, స‌హ‌జ సిద్ధ‌మైన రిజ‌ర్వాయ‌ర్ల‌కు ఓ ఐకాన్. ఈ ఒర‌వ‌డిని కొన‌సాగిస్తూనే, పూర్వ వైభ‌వాన్ని ఇనుమ‌డింప చేస్తూ, అపూర్వ వైభ‌వాన్ని తెస్తామ‌న్నారు. ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త‌, అద్భుత క‌ట్ట‌డాలు, దేవాల‌యాలు, తెలంగాణ సంస్కృతికి ప్ర‌తిబింబంగా నిలిచాయ‌న్నారు.

అలాగే, ఒక‌ప్పుడు అజంజాహీ మిల్లు, ఇప్పుడు అప్పారెల్, ఐటీ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌లు, రైల్వే జంక్ష‌న్‌, విస్తార‌మైన న‌గ‌రం, విద్యా అవ‌కాశాలు, రాష్ట్ర రాజ‌ధానికి రెండో రాజ‌ధానిగా వ‌రంగ‌ల్ ఉంద‌న్నారు. అటు సిఎం కెసిఆర్, ఇటు మంత్రి కెటిఆర్ లు వ‌రంగ‌ల్ అభివృద్ధికి అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు. త్వ‌ర‌లో అవుట‌ర్ రింగ్ రోడ్డు పూర్తి అయి, మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌లు

వావ్ వ‌రంగల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లిరావ‌డానికి ఆస్కారం ఉంద‌న్నారు. నిజంగానే ప్ర‌జ‌లు వ‌రంగ‌ల్ ని చూసి వావ్ వ‌రంగ‌ల్ అనే ప‌రిస్థితిని తెస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ కంటే కూడా వ‌రంగ‌ల్ ది పురాత‌న చ‌రిత్ర అని ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్ అన్నారు. హైద‌రాబాద్ కి ల‌వ్ హైద‌రాబాద్ లాగా, వ‌రంగ‌ల్ కి వావ్ వ‌రంగ‌ల్ ఓ ఐకాన్ కానుంద‌న్నారు.
వావ్ వ‌రంగల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లివ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్ది, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి వావ్ వ‌రంగ‌ల్ అనే విధంగా తీర్చిదిద్దుతామ‌ని విన‌య భాస్క‌ర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఫాతిమా జంక్ష‌న్ లో వావ్ వ‌రంగ‌ల్ ప‌క్క‌నే ఉన్న మ‌ద‌ర్ థెరిసా విగ్ర‌హానికి మంత్రి ఎర్ర‌బెల్లి, చీఫ్ విప్ విన‌య్ భాస్క‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు త‌దిత‌రులు పూల మాల‌లు వేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బిష‌ప్ లు, క్రైస్త‌వులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు బండ ప్ర‌కాశ్, లోక్ స‌భ స‌భ్యుడు ప‌సునూరి ద‌యాక‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ప‌లువురు కార్పొరేట‌ర్లు, మార్కెట్ చైర్మ‌న్ స‌దానందం, త‌దిత‌రులు పాల్గొన్నారు.