ఓడిన లంక..సిరీస్ భారత్ కైవసం

ఓడిన లంక..సిరీస్ భారత్ కైవసం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 రన్స్ తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. కరుణరత్నే 174 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించారు. కాగా, అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 252 రన్స్ కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో శ్రేయస్ అయ్యర్ 92 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఓడిన లంక..సిరీస్ భారత్ కైవసంఅదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్ప కూలింది. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బతీశాడు. ఇక 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లోనూ అయ్యర్ 67 రన్స్ సాధించి టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన పంత్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కగా, అయ్యర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్ గా తొలి టెస్టు విజయం ఇది.