అమరావతి : సీఎం వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో బుధవారం కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు సీఎస్ ఆదిత్యనాథ్దాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31 న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు.