సీఎం జగన్​ను కలిసిన కొత్త సీఎస్​, డీజీపీ

సీఎం జగన్​ను కలిసిన కొత్త సీఎస్​, డీజీపీఅమరావతి : సీఎం వైఎస్​ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో బుధవారం కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్​కు సీఎస్​ ఆదిత్యనాథ్​దాస్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31 న ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.