సింధు స్థానాలకు పోటెత్తిన భక్తి జన సందోహం

సింధు స్థానాలకు పోటెత్తిన భక్తి జన సందోహం

క్తజన సందోహంతో కృష్ణ సాగర సంగమం,సముద్ర తీరాలు
దేశ విదేశాల నుంచి తరలివచ్చిన యాత్రికులు,భక్తులు
కట్టు దట్టమైన పోలీస్ బందోబస్తు
లక్ష మంది పైగా భక్తులు తరలివచ్చినట్లు అంచనా
సముద్రతీరం వద్ద ట్రాఫిక్ అంతరాయం

సింధు స్థానాలకు పోటెత్తిన భక్తి జన సందోహం

వరంగల్ టైమ్స్, కృష్ణా జిల్లా : అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు మండలం హంసలదీవి గ్రామ సమీపంలో గల ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణ సాగర సంగమం, సముద్ర తీరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. కృష్ణ సాగర సంగమం, సముద్ర తీరాల వద్దకు పుణ్య స్థానాలు ఆచరించడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో నిండిపోయింది. అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిశీలికులు కడవకోల్లు నరసింహారావు దంపతులు సముద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్థానాలు ఆచరించారు.అనంతరం కృష్ణ సాగర సంగమం ప్రదేశంలో అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్థానాలను ప్రారంభించారు. సాగర సంగమం వద్ద ఉన్న కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాఘశుద్దపౌర్ణమి రోజున రుక్మిణి,సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని తిలకించి సముద్రం తీరంలో పుణ్య స్థానాలు ఆచరిస్తే పాపాలు పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పాలకాయ తిప్ప నుంచి సముద్ర తీరం వరకు వెళ్లే రహదారిపై వావానదారులకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాటానికి ఇబ్బందులు పడుతున్నారు..

నూతనంగా వివాహం అయిన దంపతులు బ్రహ్మముడులతో సూర్యోదయ సమయంలో సముద్రునికి నమస్కరించి తమతమ మెక్కులు తీర్చుకున్ని పుణ్య స్థానాలు ఆచరించారు.యువకుల కేరింతలు, సముద్రుని అలలు ఘోష, యాత్రికులు, భక్తులు స్నానాలు ఆచరించి ఆనందంగా గడిపారు. సాగర సంగమం ప్రదేశం వద్ద సముద్రంలో స్నానాలు ఆచరించడానికి భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే జల్లు స్థానాలు ఏర్పాటు చేశారు.