వివేకా హత్యకేసులో నిజాలు తెలుస్తాయి : దస్తగిరి

వివేకా హత్యకేసులో నిజాలు తెలుస్తాయి : దస్తగిరి

వివేకా హత్యకేసులో నిజాలు తెలుస్తాయి : దస్తగిరి

వరంగల్ టైమ్స్, అమరావతి : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలేంటో మున్ముందు తెలుస్తాయని అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన సీబీఐ విచారణలో ఆయన హాజరయ్యాడు. విచారణలో పాల్గొన్న దస్తగిరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలేంటో త్వరలోనే తెలుస్తాయని అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి చెప్పారు. నిజం బయటికి రావాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని అన్నారు. త్వరలో ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుందని అన్నారు. కేసు విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేయడం మంచిదేనని వ్యాఖ్యానించారు.

ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి సమన్లు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతోనే అందరిని విచారణకు పిలుస్తున్నారని, అందులో భాగంగానే ఇటీవల అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారని గుర్తుచేశారు. ఎవిడెన్స్ లేనిదే ఎవరినీ విచారణకు పిలవరని అన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటనే దానిపై అన్ని వాస్తవాలను సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతానని చెప్పారు.