28న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన

28న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనహైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శామీర్‌పేట సమీపంలోని భారత్ బయోటెక్‌ను మోదీ సందర్శించనున్నారు. కొవిడ్ నివారణకు సంబంధించి భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కొవార్టిన్ టీకా పురోగతిని ప్ర‌ధాని పరిశీలించనున్నారు. అనంతరం ప్రధాని పుణె పర్యటనకు వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు రానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన గేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే భాజపా జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. 27న బాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడా, 28న యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్. 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదరాబాద్ రానున్నారు. వీరంతా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే రోజుల్లో పాల్గొననున్నారు. ఈ నేపద్యంలో ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ రానుండటం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది.