తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులుహైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

వీరి శాంపిల్స్ ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9122 మంది ప్రయాణికులు వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు నిర్వహించారు.

9122 మంది ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 59 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వీరిలో 24 మందికి ఒమిక్రాన్ వేరియంట్ గా తేలింది. మరో 13 మంది టెస్ట్ రిజల్ట్స్ రానున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 172 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3625 యాక్టివ్ కేసులున్నాయి.