టీఎస్ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి

టీఎస్ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన సీఎస్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఎ.శాంతి కుమారిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి బాధ్యతలు చేపట్టనున్నారు. తనకు సీఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ ను కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతికుమారికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.టీఎస్ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి2025 ఏప్రిల్ వరకు శాంతి కుమారి సీఎస్ గా కొనసాగనున్నారు. 1989 బ్యాచ్ కు చెందిన శాంతి కుమారి ప్రస్తుతం అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత 30 యేళ్లుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో 4 యేళ్ల పాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.