తిరుమలలో శ్రీవాణి టికెట్లు పరిమితి

తిరుమలలో శ్రీవాణి టికెట్లు పరిమితి

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు వెయ్యికి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్ లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్ ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్ పోర్ట్ కౌంటర్ లో మాత్రమే ఆఫ్ లైన్ టిక్కెట్లు జారీ చేస్తారని వివరించారు.

శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్ కి బోర్డింగ్ పాస్ ను జతచేయాలని కోరింది. టికెట్ పై ఎయిర్ లైన్ రిఫరెన్స్ తో కూడిన పీఎన్ఆర్ నంబర్ ను కూడా నమోదు చేయించాలని సూచించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టిక్కెట్ తో పాటు బోర్డింగ్ పాసును తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారని చెప్పారు. మాధవం విశ్రాంతి భవనంలో శ్రీవాని టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.