గురుకుల స్కూళ్లో 44 మంది విద్యార్థులకు అస్వస్థత

గురుకుల స్కూళ్లో 44 మంది విద్యార్థులకు అస్వస్థత

వరంగల్ టైమ్స్, నాగర్ కర్నూలు జిల్లా : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధ పడుతున్నారు. విద్యార్థుల్లో ఐదుగురు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో గవర్నమెంట్ హాస్పిటల్‎కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గురుకుల స్కూళ్లో 44 మంది విద్యార్థులకు అస్వస్థతమిగతా విద్యార్థులకు జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ పర్యవేక్షణలో స్కూల్‎లోనే ట్రీట్మెంట్ అందించారు. వైద్య, విద్యా శాఖ అధికారులు హాస్టల్‎లోని కిచెన్, డైనింగ్ హాల్‎ను పరిశీలించారు. వాటర్ శాంపిళ్లను టెస్ట్ కోసం పంపించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు వడదెబ్బ తగిలి ఉంటుందని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ అన్నారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఉదయం పులిహోర తిన్న తర్వాత ఇబ్బంది తలెత్తినట్లు విద్యార్థులు చెబుతున్నారు.