టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దుటీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు

వరంగల్ టైమ్స్,హైదరాబాద్: జూన్ 11న తెలంగాణ వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైంది.గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం పరీక్ష జరిగింది. ఐతే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్ లు వేశారు. ఈ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టింది. తదనంతరం తాజాగా తీర్పును వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ కు టీఎస్పీఎస్సీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 పరీక్ష ఇంతకుముందే ఓ సారి రద్దైన సంగతి తెలిసిందే.