చెన్నై కెప్టెన్సీకి ధోనీ వీడ్కోలు.. ఎందుకో తెలుసా ?

చెన్నై కెప్టెన్సీకి ధోనీ వీడ్కోలు.. ఎందుకో తెలుసా ?

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా మాజీ సారథి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో జరుగబోయే ఐపీఎల్ 15వ ఎడిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ( సీఎస్కే) కు కెప్టెన్సీ చేయడం లేదని ప్రకటించాడు. తన జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానంటూ షాకింగ్ ప్రకటన చేశాడు. అదే టైంలో తర్వాతి కెప్టెన్ గా సూపర్ ఫాంలో ఉన్న రవీంద్ర జడేజాను ఎంపిక చేసినట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. 2012 లో చెన్నైతో చేరిన జడ్డూ, ఈ జట్టు సస్పెండ్ అయిన 2016, 2017 యేళ్లలో మాత్రమే వేరే ఫ్రాంచైజీల తరపున ఆడాడు. మిగతా అన్ని సీజన్లలో చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు.చెన్నై కెప్టెన్సీకి ధోనీ వీడ్కోలు.. ఎందుకో తెలుసా ?తాజా నియామకంతో చెన్నై జట్టుకు నాయకత్వం వహించబోతున్న మూడో వ్యక్తిగా జడ్డూ నిలిచాడు. మెగా వేలానికి ముందు జడ్డూని రూ. 16 కోట్లు పెట్టి చెన్నై జట్టు రీటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ధోనీ కాకుండా సురేష్ రైనా మాత్రమే ఈ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ షురూ అయినప్పటి నుంచి చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, మొదటిసారి ఈ సీజన్ లో కేవలం ఆటగాడిగానే పాల్గొనబోతున్నాడు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిస్టర్ కూల్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.