పెరిగిన గ్యాస్ ధర..ఎంతో తెలుసా ?

పెరిగిన గ్యాస్ ధర..ఎంతో తెలుసా ?

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : సామాన్యులకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే, తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై, కోల్ కతాతో పాటు ఇతర నగరాల్లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ.50 మేరకు పెంచాయి.పెరిగిన గ్యాస్ ధర..ఎంతో తెలుసా ?అలాగే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349కి చేరుకోగా, 10 కేజీల సిలిండర్ ధర రూ. 669కి, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2003.50 కి పెరిగింది. పెరిగిన రేట్లను ఒకసారి పరిశీలిస్తే, ఢిల్లీ, ముంబైలలో డిమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.949.50కి చేరుకోగా, కోల్ కతాలో రూ. 976, చెన్నైలో రూ. 965, లక్నోలో రూ. 987, పాట్నాలో రూ. 1039కి గ్యాస్ సిలిండర్ ధర చేరుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, తెలంగాణలో సిలిండర్ ధర రూ. 1002కి చేరుకోగా, ఆంధ్రప్రదేశ్ లో అయితే సిలిండర్ ధర రూ.1008 కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తర్వాత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యులపై పెను భారం పడనుంది. 2021 అక్టోబర్ నుంచి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోగా, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం విలువ లాంటి అంశాలు సిలిండర్ ధరలు పెరుగుదలపై ప్రభావం చూపాయి.