ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విక్టరీ

ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విక్టరీస్పోర్ట్స్ డెస్క్ : ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ 4 బంతుల్లో వికెట్లు తీసి జట్టుకు సక్సెస్ ను అందించాడు. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ ను వెస్టిండీస్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్ లో వెస్టిండీస్ 17 రన్స్ తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. చివరి ఓవర్ లో 20 పరుగులు అవసరం కాగా, సామ్ బిల్డింగ్స్ , క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ వికెట్లను హోల్డర్ తీశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. రోవ్ మాన్ పావెల్ 17 బంతుల్లో 35 రన్స్ చేయగా, పోలార్డ్ 41 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జేమ్స్ విన్స్ అత్యధికంగా 55 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ రన్ ఛేజ్ లో 162 రన్స్ ఆలౌటైంది. హోల్డర్ 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.