బాలయ్యను తాత అన్న ఆ మంత్రి ఎవరు ?

బాలయ్యను తాత అన్న ఆ మంత్రి ఎవరు ?

వరంగల్ టైమ్స్, అమరావతి : టిడీపీ ఎమ్మెల్యే , సినీనటుడు నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలయ్యపై విమర్శలు చేశారు. బాలయ్య బాబు కాదని, బాలయ్య తాతంటూ సెటైర్లు వేశారు. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని, బాలయ్య తాతను చూడటానికి ఎవరొస్తారంటూ గుడివాడ విమర్శించారు.బాలయ్యను తాత అన్న ఆ మంత్రి ఎవరు ?బాలయ్య ఫంక్షన్‌కు అనుకున్నంత స్థాయిలో జనం రాలేదని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. బాలయ్య ఇంకా సమరసింహారెడ్డి కాదని, ఇప్పుడు వీరసింహారెడ్డి అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్యలు రోడ్లపై మీటింగ్‌లు పెడుతున్నారని గుడివాడ అన్నారు. కాయగూరలు, పల్లీలు కొనడానికి వచ్చినవాళ్లతో మీటింగ్‌లు పెట్టి జనాలను చంపాలని చూస్తున్నారని అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ కోసం అప్లయ్ చేస్తే పరిశీలించి అనుమతి ఇస్తామని గుడివాడ పేర్కొన్నారు.

అంతకుముందు ఉత్తరాంధ్ర చర్చా వేదికపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది కోల్డ్ స్టోరేజ్ నేతలు పెట్టిన సమావేశమంటూ మంత్రి సెటైర్లు వేశారు. కొణతాల రామకృష్ణ టీడీపీ ముసుగులో పనిచేస్తున్న వ్యక్తంటూ గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. తాగుబోతు అయ్యన్న, టీడీపీ ప్రతినిధి లాంటి రామకృష్ణతో సమావేశం పెడితే చూస్తూ ఊరుకోవాలా అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే కోరిక తప్ప ఇక్కడ అభివృద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు.