మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవదహనం

మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవదహనం

వరంగల్ టైమ్స్, మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మందమర్రి మండలంలోని వెంకటాపూర్ లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగి, ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చెందిన మాసు శివయ్య అనే వ్యక్తం ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్త ఇంటి మొత్తానికి వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు.

మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవదహనం

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని మాసు శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కూతురు మౌనిక, ఆమె ఇద్దరు కూతుర్లు, సింగరేణి ఉద్యోగి శాంతయ్య సజీవదహనం చెందారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ అఖిల్ మహాజన్.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.