భారత్ లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 

భారత్ లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. భారత్ లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు 

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109. 10 కాగా, డీజిల్ ధర రూ.95.49గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ పై 88 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరగగా, విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.80, డీజిల్ ధర రూ.96.83 గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21, డీజిల్ ధర రూ.87.47గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82, డీజిల్ ధర రూ. 95.00 గా, కోల్ కతాలో పెట్రోల్ రూ.105.51, డీజిల్ రూ.90.62, చెన్నైలో పెట్రోల్ రూ. 102.16, డీజిల్ ధర రూ.92.19 గా ఉంది.