ఆన్లైన్ లో శ్రీరామనవమి, పట్టాభిషేకం టిక్కెట్లు

ఆన్లైన్ లో శ్రీరామనవమి, పట్టాభిషేకం టిక్కెట్లు

వరంగల్ టైమ్స్, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న మహా పట్టాభిషేకం వేడుకలు ఉంటాయని వివరించారు. ఈ ఉత్సవాలను వీక్షించాలనుకునే భక్తుల సౌకర్యార్థం టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.ఆన్లైన్ లో శ్రీరామనవమి, పట్టాభిషేకం టిక్కెట్లుకల్యాణోత్సవానికి రూ. 7,500, రూ. 2,500, రూ. 2వేలు, రూ. 1 వెయ్యి, రూ. 300, రూ. 150 విలువ గల సెక్టార్ టిక్కెట్లను, పట్టాభిషేకం కోసం రూ. 1 వెయ్యి విలువ గల సెక్టార్ టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఆసక్తి గల భక్తులు స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం టిక్కెట్లను www.bhadrachalamonline.com ద్వారా పొందవచ్చని తెలిపారు. అలాగే రూ.7,500 శ్రీరామనవమి ఉభయ దాతల టిక్కెట్లు కార్యాలయంలోని ఆలయ టిక్కెట్ల కౌంటర్ లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. భక్తులు దేవస్థానం కార్యాలయం పనివేళల్లో 08743-232428 నంబర్ లో సంప్రదించవచ్చని సూచించారు.