9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

వరంగల్ టైమ్స్, తిరుమల : ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత వర్చువల్‌ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాతోపాటు వాటికి సంబంధించిన దర్శన కోటాను ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.