టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు ఖరారు చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు జనవరి 29 వరకు గడువు విధించింది. ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు. 29వ తేదీలోపు చెల్లిస్తే ఎటువంటి ఆలస్య రుసుము ఉండదు.

రూ. 50 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 10 వరకు చెల్లించవచ్చు. రూ. 200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ. 500 ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు. వార్షిక పరీక్షలు ఏప్రిల్ లేదా మే 2022లో జరుగనున్నాయి.