వందే భారత్ పై రాళ్ల దాడి..నిందితుల గుర్తింపు

వందే భారత్ పై రాళ్ల దాడి..నిందితుల గుర్తింపు

వందే భారత్ పై రాళ్ల దాడి..నిందితుల గుర్తింపు

వరంగల్ టైమ్స్, విశాఖ జిల్లా : వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు వున్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రైలుపై దాడి చేసిన నిందితులను చందు, దిలీప్, శంకర్ లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బుధవారం కంచరపాలెంలో నిలిపి ఉంచిన వందేభారత్ ట్రైన్ పై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వందే భారత్ రైలు రెండు కోచ్ లకు సంబంధించిన అద్దాలు ధ్వంసమయ్యారు.

ఈ దాడి కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఈ ముగ్గురు నిందితులు మద్యం మత్తులో రాళ్లు రువ్వారా లేక వేరే కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. ఈ దాడిలో వందేభారత్ రైలు రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖకు వందే భారత్ రైలు వచ్చింది.

సికింద్రాబాద్, విశాఖపట్టణం నగరాల మధ్య పరుగులు పెట్టడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా వందేభారత్ రైలు ప్రారంభించాల్సి ఉంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా వందేభారత్ రైలు విశాఖ వరకు రన్ నిర్వహించారు. వాస్తవానికి ఈ రైలును మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు.

అయితే ట్రాక్ అప్ గ్రడేషన్ పనులు విజయవాడ -విశాఖపట్టణం మధ్య పూర్తి కావడమే కాదు పలువురు నేతలు వందేభారత్ ను విశాఖపట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా కేంద్రప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. టికెట్ ధరలను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు పూర్తైన సందర్భంగా ఆగస్టు నాటికి 75 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 80 శాతం స్థానికంగా దొరికిన వస్తువులతోనే నిర్మాణం పూర్తిగా భారత్ లోనే జరిగింది. మొత్తం రూ.వెయ్యికోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడుతున్నారు.