కేసీఆర్ తో సుబ్రహ్మణ్యస్వామి, రాకేశ్ తికాయత్ భేటీ

కేసీఆర్ తో సుబ్రహ్మణ్యస్వామి,రాకేశ్ తికాయత్ భేటీ

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ తో బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు రాకేశ్ తికాయత్ భేటీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు.కేసీఆర్ తో సుబ్రహ్మణ్యస్వామి, రాకేశ్ తికాయత్ భేటీకేసీఆర్ తో కలిసి సుబ్రమణియన్ స్వామి, రాకేశ్ తికాయత్ లంచ్ చేశారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న సీఎం కేసీఆర్, ఇటీవలే మహారాష్ట్రలో పర్యటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.