పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ: చెవిరెడ్డి

పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ
నియోజకవర్గంలో 25 వేల మంది లబ్ధిదారులు
అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే చెవిరెడ్డి

పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ: చెవిరెడ్డితిరుపతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ ఈ నెల 25వ తేదీన పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తుమ్మలగుంట సమీపంలోని తుడా అతిథిగృహంలో నియోజకవర్గ తహసీల్దార్లతో సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలో దాదాపు 25 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వీరి కోసం నియోజకవర్గంలో ప్రజలు జీవనం సాగించేందుకు అనుకూలంగా ఉండే దాదాపు 500 ఎకరాలు సేకరించినట్లు విప్​ చెవిరెడ్డి తెలిపారు. ఇక్కడ నివసించే ప్రజల కోసం లేఅవుట్లలో అభివృద్ధి ప్రణాళికలు పక్కాగా రూపొందించాలని సూచించారు. ఇళ్ల పట్టాలకు కేటాయించే లేఅవుట్ లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. మండల తహసీల్దార్లు లబ్ధిదారుల ఎంపిక కు సంబంధించి ప్రక్రియను చేపట్టాలన్నారు. అలాగే పంపిణీ చేసే పట్టాలను త్వరితగతిన పూర్తి చేయాలని విప్​ చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఓ ఎస్ డీ లు రంగస్వామి, కిరణ్ కుమార్, మండల తహసీల్దార్లు భాగ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.