హైదరాబాద్: తెలంగాణలో బుధవారం కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 108 మందికి కరోనా సోకింది. ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99 మంది మరణించగా 1,556 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,365 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3020 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 6 చొప్పున.. మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో రెండేసి కరోనా కేసులు నమోదయ్యాయి. యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒకటి చొప్పున వెలుగులోకి వచ్చాయి. ఇవాళ ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.