తెలంగాణ గ్రామాల్లో నాణ్యమైన పరిపాలన

తెలంగాణ గ్రామాల్లో నాణ్యమైన పరిపాలన

న్యూఢిల్లీలోని విజ్ఞాన్​ భవన్​ లో పిపిపి ఇచ్చిన ఆడిట్ శాఖ​ డైరెక్టర్​

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : గ్రామ పంచాయతీల అడ్మినిస్ట్రేషన్​ లో ట్రాన్సపరెన్సీ, అకౌంటబులిటీ అంశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఆడిట్​ శాఖ డైరెక్టర్​ వెంకటేశ్వర్​ రావు తెలిపారు. ‘ఆజాదికి అమృత్​ మహోత్సవ్​’ లో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్​ భవన్​ లో కేంద్ర పంచాయతీరాజ్​ మంత్రిత్వ శాఖ ఈనెల 11నుంచి 17వరకు సదస్సులు నిర్వహిస్తున్నది. అందులో సుపరిపాలన​ అంశంపై బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆడిట్​ శాఖ డైరెక్టర్​ వెంకటేశ్వర్​ రావు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​(పిపిపి) ఇచ్చారు.తెలంగాణ గ్రామాల్లో నాణ్యమైన పరిపాలన ఈ పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ఆడిట్​ శాఖ పనితీరును, గ్రామ స్థాయి నుంచి నాణ్యమైన, సమర్ధవంతమైన పరిపాలన అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్​ శాఖ జాయింట్​ సెక్రెటరీ అలోక్​ ప్రేమ్​ నగర్​, అడిషనల్​ సెక్రెటరీ చంద్రశేఖర్​ కుమార్​, తెలంగాణ ఆడిట్​ శాఖ డిప్యూటీ డైరెక్టర్​ రాము తదితరులు పాల్గొన్నారు.