బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన దాస్యం

బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డా.బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి, అణగారిన కులాల సాధికారతకు చేసిన కృషిని చీఫ్ విప్ దాస్యం కొనియాడారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన దాస్యంఅంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారత జాతి చేసుకున్న అదృష్టమని అన్నారు. దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా చేస్తున్నారన్నారు. వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తున్నారని పేర్కొన్నారు.బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన దాస్యందళిత సాధికారత కోసం, డా. బి. ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనలో భాగంగా కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకం అమలు చేస్తున్నారని అన్నారు. దీని ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని నూటికి నూరు శాతం సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 42 యూనిట్లను దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అందచేశారు.