సూర్యాపేట : కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్బాబు అమరుడైన సంగతి తెలిసిందే. సంతోష్బాబు కుటుంబానికితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రూ. 5 కోట్ల ఎక్స్గ్రేషియాతో పాటు సంతోష్బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, హైదరాబాద్లో నివాస స్థలం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. తానే స్వయంగా అమర సైనికుడి ఇంటికి వెళ్లి సాయం అందిస్తానని తెలిపారు. అన్నట్లుగానే సీఎం కేసీఆర్ సోమవారం సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు అదేవిధంగా సాయం అందించేందుకు సూర్యాపేటకు బయల్దేరి వెళ్లనున్నారు.