గుడ్​న్యూస్​: కరోనాకు మందు వచ్చేసింది

గుడ్​న్యూస్​: కరోనాకు మందు వచ్చేసింది

వరంగల్ టైమ్స్, ముంబై: కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. యాంటీ వైరల్​ డ్రగ్​ ఫావిపిరవిన్​ను ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాణాంతక కరోనా వైరస్​కు ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. ఫాబిఫ్లూ పేరుతో యాంటీవైరల్​ డ్రగ్​ ఫావిపిరవిర్​ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ మందును స్వల్ప నుంచి మధ్యస్థాయి లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించవచ్చని పేర్కొంది.గుడ్​న్యూస్​: కరోనాకు మందు వచ్చేసిందిముంబయికి చెందిన ఈ సంస్థ ఫాబిఫ్లూ తయారీ, మార్కెటింగ్​కు డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి శుక్రవారం అనుమతులు పొందింది. కరోనాకు చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే ఔషధాల్లో ఆమోదం లభించిన మొదటి డ్రగ్​ ఫాబిఫ్లూనేనని సంస్థ పేర్కొంది. “దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరైన సమయంలో ఔషధానికి ఆమోదం లభించింది. ఈ ఔషధంతో సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా ఈ ఒత్తిడిని తగ్గించవచ్చు.” అని గ్లెన్​ సల్దానా, గ్లెన్​మార్క్​ ఛైర్మన్​, ఎండీ తెలిపారు.